మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు అసంబద్ధం: ఎర్ర సత్యనారాయణ
ABN , First Publish Date - 2020-04-09T09:56:07+05:30 IST
కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న నివారణ చర్యలను ప్రజలకు చేరవేస్తున్న మీడియాపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం
రాంనగర్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న నివారణ చర్యలను ప్రజలకు చేరవేస్తున్న మీడియాపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి జర్నలిస్టులు పని చేస్తున్నారని, వారి సేవలను ప్రోత్సాహించాల్సిన సీఎం.. ప్రతి ప్రెస్మీట్లో ఏదో ఒక వంకతో మీడియాను హేళన చేస్తూ మాట్లాడడం ఆయన స్థాయికి తగదన్నారు.