కొవిడ్‌ నియంత్రణలో కేసీఆర్‌ కృషి భేష్‌: దేవెగౌడ

ABN , First Publish Date - 2021-09-06T09:21:09+05:30 IST

తెలంగాణలో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అన్నారు

కొవిడ్‌ నియంత్రణలో కేసీఆర్‌ కృషి భేష్‌: దేవెగౌడ

నిర్మల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 5: తెలంగాణలో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అన్నారు. ఆదివారం ఆయన నిర్మల్‌ జిల్లా కేంద్రంలో శ్రీకర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రెండో దశలో కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దేశంలో కరోనా తీవ్రస్థాయికి చేరి ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ వెనుకబడే ఉందని, సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.  

Updated Date - 2021-09-06T09:21:09+05:30 IST