మార్కెట్లో ఖాదీ పాద రక్షలు

ABN , First Publish Date - 2020-10-22T06:52:55+05:30 IST

ఖాదీ, గ్రామోద్యోగ సంస్థ (కేవీఐసీ) పాద రక్ష ల రంగంలోకి ప్రవేశించింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం వీటిని మార్కెట్లో విడుదల చేశారు...

మార్కెట్లో ఖాదీ పాద రక్షలు

  • ధర రూ.1,100 నుంచి రూ.3,300


న్యూఢిల్లీ : ఖాదీ, గ్రామోద్యోగ సంస్థ (కేవీఐసీ) పాద రక్ష ల రంగంలోకి ప్రవేశించింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం వీటిని  మార్కెట్లో విడుదల చేశారు. నూలుతో చేసిన వీటి ధర రూ.1,100 నుంచి రూ.3,300 మధ్యన ఉంది. పురుషుల కోసం 15 డిజైన్లు, మహిళల కోసం 10 డిజైన్లలో అందుబాటులో ఉంటాయి. వీటికి ఉచిత ప్రచారకర్తగా ఉండాలని నటి హేమమాలినిని కోరనున్నట్టు గడ్కరీ చెప్పా రు. ప్రస్తుతం దేశంలో ఏటా రూ.50,000 కోట్ల పాద రక్షలకు డిమాండ్‌ ఉంది. 

Updated Date - 2020-10-22T06:52:55+05:30 IST