క్వార్టర్స్లో కిడాంబి
ABN , First Publish Date - 2020-10-16T10:08:37+05:30 IST
భారత ఏస్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్స్కు దూసుకెళ్లగా.. మరో ఆటగాడు లక్ష్య సేన్ ఓటమితో టోర్నీ
లక్ష్య సేన్ అవుట్
డెన్మార్క్ ఓపెన్
ఒడెన్స్: భారత ఏస్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్స్కు దూసుకెళ్లగా.. మరో ఆటగాడు లక్ష్య సేన్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో ఐదోసీడ్ శ్రీకాంత్ 21-15, 21-14తో జాసన్ ఆంథోని హొ షుయ్ (కెనడా)పై వరుస గేముల్లో నెగ్గాడు. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ చో టిన్ చన్ (చైనీస్తైపీ)తో కిడాంబి తలపడనున్నాడు. మరో మ్యాచ్లో లక్ష్య సేన్ 21-15, 7-21, 17-21తో హన్స్ క్రిస్టీన్ సోల్బర్గ్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. రెండో రౌండ్ మ్యాచ్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రీకాంత్.. కేవలం 33 నిమిషాల్లోనే ప్రత్యర్థిపై విజయం సాధించాడు. తొలి గేమ్లో 4-2తో ఆధిక్యం సాధిం చిన కిడాంబి.. అదే జోరులో 9-4తో ముందంజ వేశాడు. తర్వాత మరింత దూకుడుగా ఆడి 21-15తో మొదటి గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లో జాసన్ గట్టిపోటీ ఇవ్వడంతో.. కిడాంబి 5-8తో వెనుకబడ్డాడు. కానీ, వరుసగా ఆరు పాయింట్లు సాధించిన శ్రీ.. బ్రేక్ సమయానికి 11-8తో పైచేయి సాధించాడు. తిరిగి వచ్చాక జాసన్ వరుసగా రెండు పాయింట్లు దక్కించుకొని 10-11తో స్కోరు సమం చేసే విధంగా కనిపించాడు. కానీ, ఆట వేగాన్ని ఒక్కసారిగా పెంచిన కిడాంబి..పదునైన స్మాష్లతో 15-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. వరుస ర్యాలీలతో ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా 21-14తో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ‘రెండు గేమ్ల్లో బ్రేక్ వరకు జాసన్ గట్టిపోటీ ఇచ్చాడు. ఎలా అటాకింగ్ చేయాలి, ఎప్పుడు డిఫెండ్ చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. గట్టి ప్రత్యర్థితో తలపడి విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉంద’ని శ్రీకాంత్ చెప్పాడు.