ఐపీఎల్: పంజాబ్ టార్గెట్ 172
ABN , First Publish Date - 2020-10-16T03:02:15+05:30 IST
ఐపీఎల్లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో...
షార్జా: ఐపీఎల్లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు ముందు 172 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు 38 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్(18) పూరన్కు క్యాచ్గా చిక్కి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఫించ్(20) కూడా మురుగన్ అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్గా పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 39 బంతుల్లో 48 పరుగులు చేసి ఆడుతుండగా షమీ బౌలింగ్లో షాట్కు యత్నించి రాహుల్కు క్యాచ్గా చిక్కి వెనుదిరిగాడు.
వాషింగ్టన్ సుందర్ 13, శివమ్ దూబే 23 పరుగులు చేసి ఔట్ అయ్యారు. బౌలర్లపై సిక్స్లతో విరుచుకుపడే డివిలియర్స్ ఈ మ్యాచ్లో 2 పరుగులకే షమీ బౌలింగ్లో క్యాచ్గా చిక్కి వెనుదిరిగాడు. క్రిస్ మోరిస్ 25, ఉదన 10 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. ఇక.. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనున్న పంజాబ్ క్రిస్ గేల్పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో గేల్కు ఇదే తొలి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.