ఆ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలి: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2021-03-09T20:30:00+05:30 IST
ఆ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలి: కిషన్రెడ్డి
హైదరాబాద్: భైంసాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పునరావృతం కాకుండా..శాశ్వత పరిష్కారం చేయాలని డీజీపీని ఆదేశించామన్నారు. భైంసా పరిస్థితులను ఎప్పటికప్పుడు అమిత్షా దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు.