వచ్చే ఆగస్టు నాటికి కిటెక్స్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-18T07:13:33+05:30 IST

తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగం లో అతిపెద్ద పరిశ్రమను ప్రారంభించేందుకు ప్రముఖ వస్త్ర పరిశ్రమ కిటెక్స్‌ సిద్ధమైంది. కేరళకు చెందిన ఈ సంస్థ వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌...

వచ్చే ఆగస్టు నాటికి కిటెక్స్‌ ప్రారంభం

  • సంస్థ సీఎండీ జాకబ్‌ వెల్లడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగం లో అతిపెద్ద పరిశ్రమను ప్రారంభించేందుకు ప్రముఖ వస్త్ర పరిశ్రమ కిటెక్స్‌ సిద్ధమైంది. కేరళకు చెందిన ఈ సంస్థ వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ (కేఎంటీపీ)లో రూ.1,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే 150 ఎకరాలను టీఎ్‌సఐఐసీ కేటాయించింది. కిటెక్స్‌ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాబు ఎం జాకబ్‌ శుక్రవారం వరంగల్‌కు వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. సంస్థకు కేటాయించిన స్థలాన్ని అప్పగించిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పరిశ్రమకు సంబంధించిన భారీ యంత్రాల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులతో పేర్కొన్నారు. యంత్రాల తరలింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మొదటి యూనిట్‌ అందుబాటులోకి వస్తుందని జాకబ్‌ తెలిపారు. 

Updated Date - 2021-09-18T07:13:33+05:30 IST