కరోనా ఎఫెక్ట్: కోల్‌కతా, ఆర్సీబీ మ్యాచ్ వాయిదా!

ABN , First Publish Date - 2021-05-03T18:07:39+05:30 IST

అత్యంత సురక్షితమైన బయో బబుల్‌లో గడుపుతున్న ఐపీఎల్ క్రికెటర్లను కూడా కరోనా వదలడం లేదు.

కరోనా ఎఫెక్ట్: కోల్‌కతా, ఆర్సీబీ మ్యాచ్ వాయిదా!

అత్యంత సురక్షితమైన బయో బబుల్‌లో గడుపుతున్న ఐపీఎల్ క్రికెటర్లను కూడా కరోనా వదలడం లేదు. ప్రస్తుతం దేశంలో తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా రెండో దశ ఉద్ధృతి తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను కూడా తాకింది. కోల్‌కతా జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ రోజు (సోమవారం) కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. కోల్‌కతా ఫ్రాంచైజీ ఆటగాళ్లు వరుణ్, సందీప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కేకేఆర్ ఫ్రాంచైజీ తెలిపింది. 

Updated Date - 2021-05-03T18:07:39+05:30 IST