ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మూసివేత

ABN , First Publish Date - 2021-04-16T21:03:22+05:30 IST

కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు.

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మూసివేత

కడప జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాలతో ఈ మేరకు ఆలయాన్ని మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. మే 15వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అలాగే కడప జిల్లాలోని మరో 15 ఆలయాలు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఒంటిమిట్టలో ఈ నెల 21వ తేదీ నుంచి జరగాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత నెలకొంది. 

Updated Date - 2021-04-16T21:03:22+05:30 IST