వెనుకంజ వేసేదే లేదు..!

ABN , First Publish Date - 2021-05-04T09:22:54+05:30 IST

ఎంతో పటిష్ఠంగా అమలవుతున్న ఐపీఎల్‌ బయోబబుల్‌లో కొవిడ్‌ కేసులు బయటపడడం.. ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నా.. ఫ్రాంచైజీలు మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నాయి.

వెనుకంజ వేసేదే లేదు..!

ఐపీఎల్‌ను కొనసాగించాల్సిందే అంటున్న జట్లు


న్యూఢిల్లీ: ఎంతో పటిష్ఠంగా అమలవుతున్న ఐపీఎల్‌ బయోబబుల్‌లో కొవిడ్‌ కేసులు బయటపడడం.. ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నా.. ఫ్రాంచైజీలు మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నాయి. కేసులు అనూహ్యంగా పెరుగుతున్నా ఐపీఎల్‌ను కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నాయి. ‘సగం టోర్నీ ముగిసింది. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. స్కాన్‌ కోసం బయటకు తీసుకెళ్లడం వల్ల వైరస్‌ బారిన పడి ఉంటారని అంటున్నారు. అంటే బబుల్‌ బయటే జరిగింది.


అందరూ ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటిస్తున్నారు. ఎక్కడా ఉల్లంఘనకు తావులేదు’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి  తెలిపారు. ఎక్కువ జట్లు వైరస్‌ ప్రభావానికి గురికాకపోతే.. లీగ్‌ను కొనసాగించాలని మరో అధికారి అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌ ప్రతి రోజూ తమ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేస్తుండగా.. కేకేఆర్‌ సంఘటన తర్వాత మిగతా టీమ్‌ కూడా ఇదే పద్ధతిని అనుసరించే ప్రయత్నాల్లో ఉన్నాయి. 

Updated Date - 2021-05-04T09:22:54+05:30 IST