Krishna: ఇళ్లల్లో అద్దెకు ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-03T17:58:09+05:30 IST

ఇళ్లల్లో అద్దె దిగి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..అద్దెకు దిగిన ఇంట్లోని యజమానులతో మాటలు కలిపి వారికీ కూల్

Krishna: ఇళ్లల్లో అద్దెకు ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

కృష్ణా: ఇళ్లల్లో అద్దె దిగి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇళ్లు అద్దెకు కావాలంటూ ఇంట్లో దిగుతాడు. అద్దెకు దిగిన ఇంట్లోని యజమానులతో మాటలు కలిపి వారికీ కూల్ డ్రింక్స్‎లో మత్తు మందు కలిపి ఇస్తాడు. అనంతరం వారు అపస్మారక స్థితికి చేరాక ఒంటిపై ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను, నగదు దొంగిలిస్తున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి యజమాని ఇంట్లోకి అద్దెకు దిగాడు. దిగిన రోజు నుంచి అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని..అతడి వద్ద ఉన్న రూ.3 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-03T17:58:09+05:30 IST