కృష్ణా: నడిరోడ్డుపై ప్రసవం...తల్లీబిడ్డ క్షేమం
ABN , First Publish Date - 2020-08-11T18:20:46+05:30 IST
నడిరోడ్డుపైనే ఓ నిండుగర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
కృష్ణా: నడిరోడ్డుపైనే ఓ నిండుగర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. తిరువూరు పట్టణంలో 17 వార్డ్కి చెందిన నిండు గర్భిణికి నెలలు నిండటంతో ఆసుపత్రికి వెళ్లేందుకు బయలుదేరారు. అయితే 108 వచ్చే లోపే రోడ్పై నొప్పులు రావటంతో ఈద్-గహ్కు వెళ్లే రోడ్డుపై ఆమె ప్రసవించింది. స్థానికుల సమాచారం మేరకు సకాలంలో వచ్చి ఏ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు దగ్గరుండి ఆమెకు పురుడు పోయించడంతో ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు.