Krishna: ప్రైవేట్ బస్సును ఢీకొన్న లారీ..నలుగురికి గాయాలు
ABN , First Publish Date - 2021-08-26T12:26:39+05:30 IST
నందిగామ మండలం అనాసాగరం బైపాస్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
కృష్ణా: నందిగామ మండలం అనాసాగరం బైపాస్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి యానాంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.