26 నుంచి కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు
ABN , First Publish Date - 2021-10-14T05:18:24+05:30 IST
26 నుంచి కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు
రీ షెడ్యూల్ను ప్రకటించిన వర్సిటీ అధికారులు
కేయూ క్యాంపస్, అక్టోబరు 13: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీబీఏ, మొదటి, రెండో ఏడాది, అలాగే ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ మ్యాథ్స్, హెచ్ఆర్ఎం, రూరల్ డెవల్పమెంట్, ఎల్ఎల్ఎం మొదటి ఏడాది పరీక్షలను అక్టోబరు 26 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ ఎం.సురేఖ, డాక్టర్ వై.వెంకయ్యలు షెడ్యూల్ విడుదల చేశారు. డిగ్రీ మొదటి, రెండో ఏడాది పరీక్షలతో పాటు, పీజీ కోర్సుల పరీక్షలన్నీ మఽధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. డిగ్రీ మొదటి ఏడాది పరీక్షలు అక్టోబరు 26, 28, 30 నవంబరు 2, 8, 10తేదీల్లో, రెండో ఏడాది పరీక్షలు అక్టోబరు 27, 29 నవంబ రు 1,6, 9, 11, 15 తేదీల్లో, పీజీ కోర్సుల పరీక్షలు అక్టోబరు 27, 29 నవంబరు 1, 6, 9 తేదీల్లో పరీక్షల నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం కేయూ పరీక్షల కేంద్రం వెబ్సైట్ జ్ట్టిఞట://ఠీఠీఠీ.జ్చుజ్చ్టుజీడ్చ.్చఛి.జీుఽ/లో కానీ, జ్ట్టిఞ://టఛీజూఛ్ఛిజుఠ.ఛిౌ.జీుఽ/లోకానీ సంప్రదించాలని కోరారు.