కర్నూలు జిల్లా దేవరగట్టు రక్తసిక్తం

ABN , First Publish Date - 2021-10-17T09:44:52+05:30 IST

దేవరగట్టు మరోసారి రక్తసిక్తమైంది. విజయదశమి సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు బన్ని ఉత్సవంలో శుక్రవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన స్వామివారి జైత్రయాత్ర శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.

కర్నూలు జిల్లా దేవరగట్టు రక్తసిక్తం

కర్నూలు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): దేవరగట్టు మరోసారి రక్తసిక్తమైంది. విజయదశమి సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు బన్ని ఉత్సవంలో శుక్రవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన స్వామివారి జైత్రయాత్ర శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈ కర్రల సమరంలో 47మందికి గాయాలయ్యా యి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప, ఘర్షణలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.


Updated Date - 2021-10-17T09:44:52+05:30 IST