కర్నూలు జిల్లా దేవరగట్టు రక్తసిక్తం
ABN , First Publish Date - 2021-10-17T09:44:52+05:30 IST
దేవరగట్టు మరోసారి రక్తసిక్తమైంది. విజయదశమి సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు బన్ని ఉత్సవంలో శుక్రవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన స్వామివారి జైత్రయాత్ర శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.
కర్నూలు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): దేవరగట్టు మరోసారి రక్తసిక్తమైంది. విజయదశమి సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు బన్ని ఉత్సవంలో శుక్రవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన స్వామివారి జైత్రయాత్ర శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈ కర్రల సమరంలో 47మందికి గాయాలయ్యా యి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప, ఘర్షణలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.