కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఘర్షణలు

ABN , First Publish Date - 2021-01-18T00:38:20+05:30 IST

సంజామల మండలం నట్లకొత్తూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదంలో టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది

కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఘర్షణలు

కర్నూలు: సంజామల మండలం నట్లకొత్తూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదంలో టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. నట్లకొత్తూరులో భారీగా పోలీసులు మోహరించారు.


అలాగే డోన్ పాతపేటలో కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువకుల మధ్య వర్గ పోరు జరిగింది. బ్లేడ్‌లు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-01-18T00:38:20+05:30 IST