భక్తులతో కిటకిటలాడుతున్న ఓర్వకల్లు బుగ్గరమేశ్వరస్వామి ఆలయం
ABN , First Publish Date - 2021-11-08T16:36:24+05:30 IST
ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని బుగ్గరమేశ్వర స్వామి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది.
కర్నూలు: ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని బుగ్గరమేశ్వర స్వామి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. దీంతో బుగ్గరమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారికి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధికారులు కరోనా ఆంక్షలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.