కుషాయిగూడలో భారీ చోరీ

ABN , First Publish Date - 2020-08-16T00:53:17+05:30 IST

కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీ రోడ్ నెంబర్ 6లో గల అఖిల్ అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. 25 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.25వేల నగదును దుండగులు అపహరించారు.

కుషాయిగూడలో భారీ చోరీ

హైదరాబాద్: కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీ రోడ్ నెంబర్ 6లో గల అఖిల్ అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. 25 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.25వేల నగదును దుండగులు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఇంటి పెద్ద బాలయ్య మృతి చెందడంతో అఖిల్ కుటుంబ సభ్యులంతా శుక్రవారం రాత్రి నిద్ర చేయడం కోసం యాదగిరి గుట్టకు వెళ్లారు. ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటం చూసి వారు షాక్ అయ్యారు. దొంగతనం జరిగిందని గుర్తించిన అఖిల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-16T00:53:17+05:30 IST