ఎస్సీ పథకాలు పునరుద్ధరించాలి: కేవీపీఎస్
ABN , First Publish Date - 2021-06-22T09:12:15+05:30 IST
రెండేళ్ల నుంచి ఆగిపోయిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు
అమరావతి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల నుంచి ఆగిపోయిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ కార్పొరేషన్లో కారుణ్య నియామకాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు.