ట్రైబ్యునల్‌ తీర్పులపై చివరి అవకాశం!

ABN , First Publish Date - 2021-04-11T08:45:01+05:30 IST

ప్రత్యేక ట్రైబ్యునల్స్‌లో ఏకపక్షంగా తీర్పులను రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టడంతో.. ఆయా తీర్పులపై అప్పీళ్లు, దరఖాస్తులు స్వీకరించడానికి పిటిషన్‌దారులకు ఆఖరి అవకాశం ఇచ్చారు.

ట్రైబ్యునల్‌ తీర్పులపై చివరి అవకాశం!

నోటీసులు జారీ చేసిన సీసీఎల్‌ఏ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ట్రైబ్యునల్స్‌లో ఏకపక్షంగా తీర్పులను రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టడంతో.. ఆయా తీర్పులపై అప్పీళ్లు, దరఖాస్తులు స్వీకరించడానికి పిటిషన్‌దారులకు ఆఖరి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 15, 16 తేదీల్లో ప్రత్యేక ట్రైబ్యునళ్లకు విజ్ఞప్తులు చేసుకోవచ్చు. ఆ తర్వాత పిటిషన్లకు అవకాశం ఉండదు. 16 వరకు వచ్చే పిటిషన్ల విచారణ తేదీలను ఈ నెల 19న ఖరారు చేస్తారు. ఆ వివరాలు అందుబాటులో ఉంటాయి. కక్షిదారులు, ప్రతివాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీసీఎల్‌ఏ సూచించారు. 

Updated Date - 2021-04-11T08:45:01+05:30 IST