నేతలు భౌతికదూరం పాటించాల్సిందే: హైకోర్టు
ABN , First Publish Date - 2020-04-08T10:07:06+05:30 IST
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రాజకీయ నేతలు కూడా భౌతికదూరం పాటించాల్సిందేనని, లాక్డౌన్ నిబంధనలకు లోబడి నడచుకోవాల్సిందేనని ..
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రాజకీయ నేతలు కూడా భౌతికదూరం పాటించాల్సిందేనని, లాక్డౌన్ నిబంధనలకు లోబడి నడచుకోవాల్సిందేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ సందర్భంగా సహాయ చర్యలను సమీక్షించేందుకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే ధర్మశ్రీ మార్చి 30న చోడవరంలో అధికారులతో సమావేశం నిర్వహించారని, ఈ సందర్భంగా వారెవరూ భౌతిక దూరం పాటించలేదని వివరిస్తూ న్యాయవాది జి.లక్ష్మీనారాయణ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. లేఖపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో అలాంటి సమావేశాలు నిర్వహించకపోవడమే మేలని అభిప్రాయపడింది.