కేంద్రమంత్రి వినోద్కుమార్ లేఖ
ABN , First Publish Date - 2021-01-18T00:07:29+05:30 IST
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్కు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల్లో
హైదరాబాద్: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్కు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల్లో పెండింగ్లో ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని లేఖలో వినోద్కుమార్ కోరారు. కాంట్రాక్ట్ టీచర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న కొత్త కేంద్రీయ విద్యాలయాల.. ప్రతిపాదనలకు మోక్షం కల్పించాలని వినోద్కుమార్ కోరారు. ఉపాద్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యా బోధన ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులతోపాటు కాంట్రాక్ట్ టీచర్స్ పోస్టులను రెగ్యులర్ పద్దతిలో భర్తి చేయాలని లేఖలో వినోద్కుమార్ కోరారు.