భార్యను చంపిన భర్తకు యావజ్జీవ ఖైదు

ABN , First Publish Date - 2021-04-08T12:00:23+05:30 IST

భార్యను చంపిన భర్తకు యావజ్జీవ శిక్ష విధిస్తూ నాలుగో

భార్యను చంపిన భర్తకు యావజ్జీవ ఖైదు

హైదరాబాద్‌ సిటీ/ సైదాబాద్‌: భార్యను చంపిన భర్తకు యావజ్జీవ శిక్ష విధిస్తూ నాలుగో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి బుధవారం తీర్పునిచ్చారు. 2016 మార్చి 27న సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతల్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన పీట్ల వెంకటేశ్‌కు 2006లో కల్పనతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశ్‌ ఆ రోజు (27-3-2016)న కూడా గొడవపడి సుత్తెతో ఆమె తలపై కొట్టి.. చనిపోయిన తర్వాత పారిపోయాడు. మృతురాలి సోదరు డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు, సాక్ష్యాల వాంగ్మూలాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు హత్య చేసినట్లు రుజువు కావడంతో అతడికి యావజ్జీవ ఖైదు, రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

Updated Date - 2021-04-08T12:00:23+05:30 IST