మూడు రాజధానుల్లోనూ లోకాయుక్త క్యాంపు కార్యాలయాలు

ABN , First Publish Date - 2021-09-16T06:02:54+05:30 IST

హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని ఎట్టకేలకు రాష్ట్రానికి తరలించారు. అయితే ఆ కార్యాలయాన్ని కర్నూల్‌లో ఏర్పాటు చేయడం వల్ల కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో...

మూడు రాజధానుల్లోనూ లోకాయుక్త క్యాంపు కార్యాలయాలు

హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని ఎట్టకేలకు రాష్ట్రానికి తరలించారు. అయితే ఆ కార్యాలయాన్ని కర్నూల్‌లో ఏర్పాటు చేయడం వల్ల కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. మూడు రాజధానుల వ్యవస్థపై పాలకులు పట్టుదలగా ఉన్న నేపథ్యంలో లోకాయుక్త కార్యాలయాలను ప్రజల సౌలభ్యం కోసం కర్నూల్‌తో పాటు అమరావతి, విశాఖలలో కూడా ఏర్పాటు చేయాలి. కనీసం  క్యాంపు   కార్యాలయాలనైనా ఏర్పాటు చేసి నెలలో కొన్ని నిర్ణీత దినాలయినా వాటి ద్వారా ప్రజలకు సేవలందించాలి. కోస్తా ప్రాంతం వారి ఫిర్యాదులు అమరావతి, విశాఖలలోనే పరిష్కరించాలి. ఈ మేరకు కోస్తా ప్రాంతం ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించాలి.

గరిమెళ్ళ రామకృష్ణ

Updated Date - 2021-09-16T06:02:54+05:30 IST