ఆత్మకూరులో 120 ఇళ్ల కూల్చివేత దారుణం: లోకేష్
ABN , First Publish Date - 2021-04-18T21:12:08+05:30 IST
ఆత్మకూరులో 120 ఇళ్ల కూల్చివేత దారుణమని నారా లోకేష్ అన్నారు.
అమరావతి: ఆత్మకూరులో 120 ఇళ్ల కూల్చివేత దారుణమని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జే ట్యాక్స్ వసూలు కాకపోతే ఎమ్మెల్యే జేసీబీలు పంపుతున్నారని విమర్శించారు. వారికి ప్రత్యామ్నాయం చూపకుండా పేద కూలీల ఇళ్లు కూలగొడతారా? అంటూ మండిపడ్డారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా సెలవు రోజు ఏంటీ విధ్వంసమని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ టీడీపీ పోరాడుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు.