దీపావళి శుభాకాంక్షలు తెలిపిన లోకేష్
ABN , First Publish Date - 2021-11-04T00:23:55+05:30 IST
ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపం వెలిగించుకుందామంటే నూనె ధర మండుతోందని
అమరావతి: ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపం వెలిగించుకుందామంటే నూనె ధర మండుతోందని దుయ్యబట్టారు. లైట్లు వేసుకుందామంటే కరెంటు చార్జీలు షాక్ కొడుతున్నాయని తెలిపారు. ఏపీలో దీపావళి నాడు ప్రజల పరిస్థితి ఇలా ఉందన్నారు. నరకాసుర పాలన ఇలాగే ఉండేదేమోనని వ్యాఖ్యానించారు. మున్ముందు మంచి రోజులు రావాలని ఆశిద్దామన్నారు. ఇంటిల్లిపాదికీ ఆనందాలు పంచే దీపాల పండుగ వేళ, సర్వశుభాలు కలగాలని లోకేష్ కోరుకున్నారు.
.