షార్జాలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మెగా ఈవెంట్
ABN , First Publish Date - 2020-02-22T16:03:48+05:30 IST
సంగీత సామ్రాజ్యానికి రారాజు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా. ఆయన పాటను ఇష్టపడని వారంటూ ఉండరు.
షార్జా: సంగీత సామ్రాజ్యానికి రారాజు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా. ఆయన పాటను ఇష్టపడని వారంటూ ఉండరు. ఇళయరాజా బాణీ కట్టిన ఎన్నో పాటలు ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. అయితే, చాలా కాలం తర్వాత మ్యూజిక్ మ్యాస్ట్రో షార్జాలో ఒక మెస్మరైజింగ్ మ్యూజిక్ షో నిర్వహించబోతున్నారు. మార్చి 27వ తేదీన షార్జా అంర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. పలువురు ప్రముఖ భారత గాయని గాయకులు ఈ షోలో పాల్గొంటున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, మనో, మధు బాలక్రిష్ణన్, ఉషా ఉతప్, శ్వేత మోహన్, విభావరి, సర్మూఖీ, అనిత కార్తీకేయన్ ఈ కార్యక్రమంలో తమ గాత్రం వినిపించనున్నారు. ఈ షోకు సంబంధించిన టికెట్లను గురువారం నుంచి విక్రయించనున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. 'బుక్మైషో' ద్వారా ఈ ఈవెంట్ టికెట్లు కొనుగోలు చేయొచ్చు.