మహబూబాబాద్లో పెళ్లింట పెను విషాదం
ABN , First Publish Date - 2020-08-09T02:07:06+05:30 IST
మహబూబాబాద్ : జిల్లాలోని ఆమనగల్లులో పెళ్లి ఇంట్లో పెను విషాదం నెలకొంది.
మహబూబాబాద్ : జిల్లాలోని ఆమనగల్లులో పెళ్లి ఇంట్లో పెను విషాదం నెలకొంది. పెళ్లికి కొన్ని గంటల ముందే వరుడు నరేష్ (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు డప్పులు మోగాయి.!. నరేష్ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే వరుడి మృతికి కారణాలేంటి..? అనే విషయాలు తెలియరాలేదు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.