మహబూబాబాద్: పొలంగట్టు వివాదంలో వ్యక్తిపై దాడి...మృతి

ABN , First Publish Date - 2020-08-04T15:45:43+05:30 IST

మహబూబాబాద్: పొలంగట్టు వివాదంలో వ్యక్తిపై దాడి...మృతి

మహబూబాబాద్: పొలంగట్టు వివాదంలో వ్యక్తిపై దాడి...మృతి

మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలం రౌతుగూడెం తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొలంగట్టు వివాదంలో ఆంగోతు బాలుపై ప్రత్యర్థులు బాబూలాల్, హత్తిరామ్ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలు మృతి చెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మృతుడి బంధువులు ప్రత్యర్థి హత్తిరామ్ ఇంటిని, ట్రాక్టర్‌ను తగులబెట్టారు. 

Updated Date - 2020-08-04T15:45:43+05:30 IST