మహబూబాబాద్లో దోపిడీ దొంగల బీభత్సం
ABN , First Publish Date - 2021-10-13T14:35:13+05:30 IST
జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎమ్లో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎమ్లో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి టీటీఎం సెంటర్లో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా మొదటి అంతా షార్ట్ సర్క్యూట్ అని పోలీసులు భావించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ప్రమాదం కాదు.. ప్లాన్ ప్రకారం చేసిన చోరీ యత్నం అని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.