కరోనా బాధితుల వైద్యం కోసం మల్లారెడ్డి జనరల్ ఆస్పత్రి

ABN , First Publish Date - 2020-03-30T20:19:03+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలను సర్కారు ముమ్మరం చేసింది. కరోనా బాధితుల వైద్యం కోసం మల్లారెడ్డి జనరల్ ఆస్పత్రిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.

కరోనా బాధితుల వైద్యం కోసం మల్లారెడ్డి జనరల్ ఆస్పత్రి

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలను సర్కారు ముమ్మరం చేసింది. కరోనా బాధితుల వైద్యం కోసం మల్లారెడ్డి జనరల్ ఆస్పత్రిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ఆదేశాలతో 750 పడకలను ఆస్పత్రి యాజమాన్యం కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 22 ప్రైవేట్‌ వైద్య విద్య కళాశాలల్లోని పడకలన్నింటినీ కరోనా బాధితులకు సేవలందించేందుకే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా కాలేజీల్లోని 3,350 ఐసోలేషన్‌ పడకలు, 236 ఐసీయూ పడకలు, 80 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈమేరకు ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలను ఒప్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, కాళోజీ హెల్త్‌ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు.

Updated Date - 2020-03-30T20:19:03+05:30 IST