రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-01-26T05:57:54+05:30 IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
షాద్నగర్ అర్బన్: షాద్నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో సోమవారం ట్రాక్టర్ ఢీకొని కొత్త గోవర్దన్(55) అనే వ్యక్తి దుర్మర ణం చెందాడు. వెల్డర్గా పనిచేస్తున్న గోవర్దన్ తన మోపెడ్పై పరిగి రోడ్డు విజయ్నగర్ కాలనీ నుంచి షాద్నగర్వైపు వస్తుండ గా ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడని పోలీసులు తెలిపారు. గోవర్దన్ కుమారుడు రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విజయ్భాస్కర్ తెలిపారు.
- అనుమానాస్పద స్థితిలో డ్రైవర్...
కొందుర్గు: మండల కేంద్రంలోని జీఎం పటేల్ ఫిల్లిం గ్ స్టేషన్ ఎదురుగా ఉన్న వెంచర్లో సంతో్షగిరి అనే ఇటాచీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన సంతో్షగిరి గంగన్నగూడ శివారు క్రషర్ మిషన్లో ఇటాచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 21న 5వేల రూపాయలు తీసుకుని కొందుర్గు వచ్చిన రా జేష్ సోమవారం శవమై కనిపించాడు. మృతదేహం కుళ్లిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- గుర్తు తెలియని వృద్ధుడు..
షాద్నగర్ అర్బన్: షాద్నగర్లోని పటేల్రోడ్డులో గుర్తుతెలియని 65ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం కమ్యూనిటీ ఆసుపత్రి మార్చు రీకి తరలించారు. వృద్ధుడి ఆచూకీ కోసం తెలుసుకోవాలనుకునే వారు షాద్నగర్ పోలీస్స్టేషన్ ఫోన్ నెంబర్ 08548252333కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.
- చేపలు పడుతూ మత్స్యకారుడు..
కేశంపేట: చేపల వేటకు వెళ్లి గుండెపోటుకు గురై మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన ఇప్పలపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రొయ్యల వెంకటేష్(34) ఆదివారం సాయంత్రం చెరువులో చేపలు ప ట్టడానికి వెళ్లాడు. చెరువులోకి దిగగానే గుండెపోటుకు గురై నీటిలో పడిపోయాడు. వెంకటేష్కు భార్య కృష్ణవే ణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు.