సూర్యాపేట వైపు వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఆపి మరీ ఎక్కాడు.. చివరకు ఘోరం..

ABN , First Publish Date - 2020-07-14T22:29:20+05:30 IST

మండలంలోని జీళ్లచెరువు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం గ్రామానికి

సూర్యాపేట వైపు వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఆపి మరీ ఎక్కాడు.. చివరకు ఘోరం..

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

మృతుడిది సూర్యాపేట జిల్లా.. మరొకరికి తీవ్రగాయాలు


కూసుమంచి (ఖమ్మం): మండలంలోని జీళ్లచెరువు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం గ్రామానికి దూబని గుర్వయ్య(34) మృతి చెందాడు. ఖమ్మం నుంచి సూర్యాపేటవైపునకు బోలెరో వాహనం వెళుతుండగా, మార్గమధ్యంలో గుర్వయ్య ఎక్కాడు. ఈక్రమంలో జీళ్లచెరువు వద్దకు రాగానే బోలెరో వాహనం బోల్తాపడింది. వాహనంలో ప్రయాణిస్తున్న గుర్వయ్య అక్కడిక్కడే దుర్మరణం చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసునమోదు చేశారు.


రోగికి రూ.85వేల ఆర్ధికసాయం

రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధారావత్‌ రమేష్‌కు అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐ గోర్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.85వేలు అందజేశారు. బీజేపీ మండలపార్టీ అధ్యక్షుడు గోరీలపాడుతండాకు చెందిన రవి రాధోడ్‌ బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.  మానవతా దృక్పధంతో సాయం అందజేసిన ఫౌండేషన్‌ సభ్యులకు రమేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2020-07-14T22:29:20+05:30 IST