భార్యను చంపి..కుమారుడితో పరారైన భర్త
ABN , First Publish Date - 2021-03-30T14:04:29+05:30 IST
భార్యను చంపిన కసాయి భర్త తన కుమారుడిని తీసుకొని పారిపోయిన ఘటన...
లూథియానా (పంజాబ్): భార్యను చంపిన కసాయి భర్త తన కుమారుడిని తీసుకొని పారిపోయిన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నగరంలో జరిగింది. లూథియానా నగరానికి చెందిన 21 ఏళ్ల వయసుగల వివాహితను ఆమె భర్త మద్యం తాగొచ్చి ఆమెతో గొడవపడి హత్య చేశాడు. అనంతరం భర్త తన కుమారుడిని తీసుకొని పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదు మేర పోలీసులు వచ్చి వివాహిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి హంతకుడైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్య హత్య ఘటనలో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బలగాలను నియమించామని ఎస్పీ గురుప్రీత్ సింగ్ చెప్పారు.