అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం

ABN , First Publish Date - 2021-06-11T20:42:16+05:30 IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం రోజు తూట పేలడంతో ఓ మహిళతోపాటు ఏడాది బాబు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని రాయల్ పామ్ బీచ్‌లో ఉన్న

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం రోజు తూట పేలడంతో ఓ మహిళతోపాటు ఏడాది బాబు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని రాయల్ పామ్ బీచ్‌లో ఉన్న పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్‌లో గురువారం రోజు ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో వృద్ధ మహిళ సహా ఏడాది వయసున్న ఆమె మనవడు తీవ్రంగా గాయపడ్డి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కాల్పులకు పాల్పడ్డ సదరు దుండగుడు సైతం తనను తాను కాల్చుకుని మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. దుండగుడు ఏ కారణం చేత కాల్పులకు పాల్పడ్డాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలో గత ఆదివారం కూడా ఓ దుండగుడు కాల్పులకు తెలగబడ్డ విషయం తెలిసిందే. మియామిలోని జరిగే గ్రాడ్యూయేషన్ పార్టీలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. 


Updated Date - 2021-06-11T20:42:16+05:30 IST