బ్యాంక్ లోన్‌ రాలేదని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-14T13:46:18+05:30 IST

ఇంటి రెండో అంతస్తు నిర్మాణానికి బ్యాంకు రుణం తిరస్కరించిందనే కారణంతో

బ్యాంక్ లోన్‌ రాలేదని వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్/అల్వాల్‌ : ఇంటి రెండో అంతస్తు నిర్మాణానికి బ్యాంకు రుణం తిరస్కరించిందనే కారణంతో జీవితం పై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం అల్వాల్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఓల్డ్‌ అల్వాల్‌, సూర్యానగర్‌లోని చేతన్‌ హౌజింగ్‌ సొసైటీలో మాసాని స్వప్న, మాసాని శ్రీనివాస్‌రెడ్డి (40) దంపతులు నివసిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటికి రెండోఅంతస్తు నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్న వారు బ్యాంక్‌లో లోన్‌కు సంబంధించిన ఫార్మలీటిస్‌ను కూడా పూర్తి చేశారు. అయితే సదరు బ్యాంక్‌ రుణాన్ని తిరస్కరించింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన భార్య స్వప్న, సోదరుడు, అద్దెకు ఉండే వారి సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించిగా అప్పటికే శ్రీనివా‌స్‌రెడ్డి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఆమె అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-14T13:46:18+05:30 IST