మంచిర్యాలలో ఎదురెదురుగా రెండు కార్లు ఢీ, ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-02-27T13:14:01+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ఎదురెదురుగా దూసుకువచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా...

మంచిర్యాలలో ఎదురెదురుగా రెండు కార్లు ఢీ, ఒకరు మృతి

మంచిర్యాల: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ఎదురెదురుగా దూసుకువచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున లక్షెట్టిపేట విజయా డెయిరి సమీపంలో చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-27T13:14:01+05:30 IST