వైసీపీ ప్రభుత్వంపై మంతెన ఆగ్రహం

ABN , First Publish Date - 2021-01-17T16:27:13+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై మంతెన ఆగ్రహం

ఏలూరు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మూడు రాజధానుల మిధ్యతో ప్రజలను వంచిస్తున్నారన్నారు.రాజధాని వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి శూన్యమన్నారు. రాజధాని విషయంలో తప్పు చేశామా? అని తల పట్టుకునే రోజు వైసీపీకి వస్తుందన్నారు.  అమరావతి రాజధానిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం జగన్ చర్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయిందని మండిపడ్డారు. జగనాసుర పాలన అంతానికి అమరావతి నుండే నాంది అవుతుందని చెప్పారు. 397 రోజులగా రైతులు చేస్తున్న ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని మంతెన రామరాజు పేర్కొన్నారు.

Updated Date - 2021-01-17T16:27:13+05:30 IST