12 ఏళ్ల వయసులో బాల్య వివాహం.. 20 రోజుల క్రితమే అత్తారింటికి.. ఆ ఒక్క కోరికకు అత్తమామలు నో చెప్పారని..
ABN , First Publish Date - 2021-11-29T22:22:42+05:30 IST
ఆమెకు 12 ఏళ్ల వయసులో బాల్య వివాహం జరిగింది. భర్త వృత్తిరీత్యా వేరే చోట ఉండగా ఆ యువతి అత్తామామలతో కలిసి ఉంటోంది. పుట్టింటి నుంచి 20 రోజుల క్రితమే ఆమె అత్తారింటికి వెళ్లింది. అయితే భర్త తనకు దగ్గర్లో లేకపోవడంతో
ఆమెకు 12 ఏళ్ల వయసులో బాల్య వివాహం జరిగింది. భర్త వృత్తిరీత్యా వేరే చోట ఉండగా ఆ యువతి అత్తామామలతో కలిసి ఉంటోంది. పుట్టింటి నుంచి 20 రోజుల క్రితమే ఆమె అత్తారింటికి వెళ్లింది. అయితే భర్త తనకు దగ్గర్లో లేకపోవడంతో ఆమె ప్రతి చిన్న విషయం అత్తమామలకు చెప్పి చేసేది. ఇదే క్రమంలో ఓ రోజు ఆమె వారిని ఓ కోరిక కోరింది. అయితే దానికి అత్తమామలు అంగీకరించపోవడంతో ఆమె అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..
చిత్తోర్గఢ్కు చెందిన జగదీష్ కీర్కు గీతతో గతంలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఆమె వయసు 12 సంవత్సరాలు కాగా ఇపుడు 20 ఏళ్లు. జగదీష్ ముంబైలో ఉంటూ ఉద్యోగం చేస్తుండగా.. గీత అత్తమామలతో కలిసి ఉంటుంది. 20 రోజుల క్రితమే ఆమె పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చింది. అపుడు మళ్లీ ఆమెకు ఓసారి పుట్టింటికి వెళ్లి రావాలనిపించింది. అదే విషయమై అత్తామామలను అడిగింది. దానికి వారు వచ్చి 20 రోజులే అవుతుంది కదా.. మళ్లీ ఇపుడే వెళ్లడం వద్దని అన్నారు. దీంతో మనస్తాపం చెందిన గీత అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన గీత రావతీయ గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ట్రాక్ మీద మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆధారాల కోసం మృతదేహం ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా ఆమె గీత అని నిర్ధారించుకున్న తర్వాత పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు. అయితే ఆత్మహత్యకు ముందు గీత ధరించిన స్వెటర్ను తీసి పొదల్లో పెట్టింది. కాగా ఐదు నెలల క్రితమే గీత తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు.