మారుతి కార్ల ధరల పెంపు

ABN , First Publish Date - 2021-01-19T05:48:14+05:30 IST

మారుతి కార్ల ధరల పెంపు

మారుతి కార్ల ధరల పెంపు

న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ.. సోమవారం నుంచి వాహన ధరలు పెంచింది. ఎంపిక చేసిన మోడళ్ల ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.34,000 వరకు పెరిగినట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అయి తే, ధర పెంచిన మోడళ్ల వివరాలను మాత్రం స్పష్టం చేయలేదు. కొన్ని మోడళ్లకు చెందిన కొన్ని వేరియంట్లు మినహా మిగతా అన్నింటి ధరలు పెరిగినట్లు మారుతి సుజుకీ డీలర్ల ద్వారా తెలిసింది. 

Updated Date - 2021-01-19T05:48:14+05:30 IST