ఆ డివిజన్ల అభివృద్ధికి కూడా కృషి చేస్తా: మేయర్ విజయలక్ష్మి
ABN , First Publish Date - 2021-04-12T20:49:35+05:30 IST
నగర మేయర్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు
హైదరాబాద్: నగర మేయర్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు తనతో టచ్లో ఉన్నారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. వారు గెలిచిన డివిజన్ల అభివృద్ధికి తాను కృషి చేస్తానని మేయర్ పేర్కొన్నారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో కౌన్సిల్ సమావేశం ఉంటుందని విజయలక్ష్మి తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాల్సిందేనని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు.