జిల్లా పంచాయతీ అధికారి రఘువరణ్ బదిలీ
ABN , First Publish Date - 2021-10-13T05:18:22+05:30 IST
జిల్లా పంచాయతీ అధికారి రఘువరణ్ బదిలీ
మహబూబాబాద్ టౌన్, అక్టోబరు 12: మహబూబాబాద్ జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఎం.రఘువరణ్ భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రత్యేక కార్యదర్శి సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మానుకోట జడ్పీ సీఈవోగా నర్మద..
జిల్లా పరిషత్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డిప్యూటీ సీఈవో)గా పి.నర్మద పదోన్నతిపై వస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం ఎంపీడీవోగా పని చేస్తున్న నర్మదకు జడ్పీ సీఈవోగా పదోన్నతి కల్పిస్తు మానుకోట జిల్లా పరిషత్కు బదిలీ చేశారు. ఇక్కడ డిప్యూటీ సీఈవోగా పని చేసిన విద్యులత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ కావడంతో ఆ పోస్టు సంవత్సర కాలంగా ఖాళీగా ఉంటుంది.