Shameerpet పెద్దచెరువులో గల్లంతైన యువకుల మృతదేహాలు వెలికితీత
ABN , First Publish Date - 2021-07-16T16:43:38+05:30 IST
జిల్లాలోని శామీర్పేట్ పెద్దచెరువులో నిన్న సాయంత్రం గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలను గత ఈతగాళ్లు వెలికితీశారు.
మేడ్చల్: జిల్లాలోని శామీర్పేట్ పెద్దచెరువులో నిన్న సాయంత్రం గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలను గత ఈతగాళ్లు వెలికితీశారు. మృతులు బొల్లారం కాలసిగూడ, రిసాలా బజార్కి చెందిన శివ, శోబిత్లుగా గుర్తించారు. అభిషేక్ అనే స్నేహితుడి జన్మదిన వేడుకలలో ఎనిమిది మంది యువకులు పాల్గొని...ఆపై సరదాగా చెరువులో ఈతకువెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు శివ, శోబిత్ చెరువులో గల్లంతయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.