పోలీసులకు మెడికల్ కిట్లు అందచేత
ABN , First Publish Date - 2020-08-14T10:10:11+05:30 IST
నగరంలోని పరుచూరి డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో టుటౌన్ సీఐ తుమ్మా గోపికి
ఖమ్మంక్రైం, ఆగస్టు13: నగరంలోని పరుచూరి డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో టుటౌన్ సీఐ తుమ్మా గోపికి గురువారం రూ.లక్ష విలువ చేసే మెడికల్కిట్స్, విటమిన్, మినరల్ టాబెట్లను అందించారు. నిరంతరం విధి నిర్వాహణలో ఉంటూ ప్రజలకు సహాయం అందించడంతోపాటు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సహకరిస్తున్న పోలీసులకు తమవంతు సహాయం అందించినట్టు డాక్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా టుటౌన్ సీఐ తుమ్మా గోపి, ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.