వైద్య విద్యార్థుల దాతృత్వం

ABN , First Publish Date - 2021-05-14T06:13:50+05:30 IST

కరోనా కష్టసమయంలో తమ వంతు సాయమందించారు ఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం విద్యార్థులు

వైద్య విద్యార్థుల దాతృత్వం
మంత్రి పువ్వాడకు రూ.లక్ష చెక్కు అందిస్తున్న సాయిప్రవళిక

 కరోనా రోగుల కోసం రూ.లక్ష విరాళం

మంత్రి పువ్వాడకు చెక్కు అందజేత 

ఖమ్మం సంక్షేమ విభాగం, మే 13: కరోనా కష్టసమయంలో తమ వంతు సాయమందించారు ఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం విద్యార్థులు సాయిప్రవళిక, సాయివినీత్‌, లిఖిత, మహిత. కొవిడ్‌ రోగులకు సాయం అందించాలని నిర్ణయించుకున్న ఆ నలుగురు తమ రోజువారీ అవసరాల కోసం దాచుకున్న సొమ్ములో ఖర్చులను తగ్గించుకుని రూ.1లక్ష వరకు కూడ బెట్టి.. ఆమొత్తాన్ని చెక్కురూపంలో గురువారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అందజేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమంలో ఉన్న మంత్రిని కలిసిన విద్యార్థిని సాయిప్రవళిక తన స్నేహితుల తరపును చెక్కును అందజేయగా.. మంత్రి ఆ విద్యార్థుల దాతృత్వాన్ని మెచ్చుకున్నారు. కలెక్టర్‌ కర్ణన్‌, పోలీసు కమిషనర్‌ విష్ణు యస్‌ వారియర్‌, జిల్లా ఆసుపత్రి అధికారులు, వైద్యులు, వారిని అభినందించారు. 


Updated Date - 2021-05-14T06:13:50+05:30 IST