‘మేడిగడ్డ’కు పెరుగుతున్న ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2021-08-02T05:47:27+05:30 IST

‘మేడిగడ్డ’కు పెరుగుతున్న ఇన్‌ఫ్లో

‘మేడిగడ్డ’కు పెరుగుతున్న ఇన్‌ఫ్లో

బ్యారేజీలోకి 1.29 లక్షల క్యూసెక్కులు

మహదేవపూర్‌ రూరల్‌, ఆగస్టు 1 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి  ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతూ వస్తోంది. శనివారం వరకు బ్యారేజీలోకి 60వేల క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఆదివారం రెండింతలైంది. ఆదివారం బ్యారేజీలోకి  లక్ష 29వేల 640 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 24 గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో 6.50 టీంఎంసీల నీరునిల్వ ఉండగా నీటిమట్టం 8 మీటర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2021-08-02T05:47:27+05:30 IST