పోలీసుల తీరుపై ఎన్నికల అధికారులను కలుస్తా..

ABN , First Publish Date - 2021-03-11T01:12:32+05:30 IST

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై త్వరలోనే

పోలీసుల తీరుపై ఎన్నికల అధికారులను కలుస్తా..

విజయవాడ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై త్వరలోనే డీజీపీ, ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు. ఏపీలో ఓటింగ్ శాతం తక్కువ కావడానికి కారణం పోలీసులేనని ఆయన ఆరోపించారు. గత 32 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని జలీల్ ఖాన్ పేర్కొన్నారు.


 మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా తీవ్రవాదంలో ఉన్నామో అర్ధంకాని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపక్షంగా, దౌర్జన్యంగా సీఐలే దగ్గరుండి డబ్బులిచ్చి పంచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అవినీతిపరుడైన మంత్రి ఇంటి ముందు షాడో పార్టీ లేదని, కానీ నా ఇంటి ముందే షాడో పార్టీ ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి వెలంపల్లికి లేదని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ అన్నారు.

Updated Date - 2021-03-11T01:12:32+05:30 IST