టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే వేగంగా అభివృద్ధి పనులు- మంత్రి అజయ్
ABN , First Publish Date - 2021-01-17T20:59:20+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అనేక పధకాలనుప్రవేశ పెట్టినట్టు తెలిపారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. ఆదివారం జిల్లాలో పలు అభివృద్ధిపనులకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు.
ఖమ్మం నియోజక వర్గం పరిధిలోని రఘునాధ్ పాలెం మండలంలోని వీవీపాలెం గ్రామంలో 2కోట్లతో నూతనంగా నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్, రోడ్ విస్తరణపనులకు , రఘునాధ పాలెం మండలంలోని మంచుకొండ గ్రామంలో 2కోట్లతో నూతనంగా నిర్మించనున్న రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు కూడా మంత్రి శ్రీకారం చుట్టారు. అలాగే రఘునాధపాలెంలోని శివాయిగూడెం గ్రామంలో 12.60 లక్షలతో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్నికూడా మంత్రి ప్రారంభించారు.