ఓటీఎస్ నిర్బంధమైన పథకం కాదు...స్వచ్చంధం: మంత్రి botsa

ABN , First Publish Date - 2021-12-28T16:27:43+05:30 IST

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై నీతి ఆయోగ్ వచ్చి ర్యాంకు ఇచ్చిందని... దానికి బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

ఓటీఎస్ నిర్బంధమైన పథకం కాదు...స్వచ్చంధం: మంత్రి botsa

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై నీతి ఆయోగ్ వచ్చి ర్యాంకు ఇచ్చిందని... దానికి బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలు ఎంతమేరకు నెరవేర్చిందో బీజేపీ చూసుకోవాలని హితవుపలికారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీ రాష్ట్రంలో సభ నిర్వహిస్తోందన్నారు. బీజేపీ ఒక రాజకీయ పార్టీ... కాబట్టి సభలు నిర్వహించుకుంటారని తెలిపారు. ఓటీఎస్ నిర్బంధమైన పథకం కాదు... స్వచ్చంధమని స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకే ఓటీఎస్ పథకం తీసుకొచ్చామన్నారు. రూపాయి ఇస్తాం అంటున్న వాళ్ళు.. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-28T16:27:43+05:30 IST