బీజేపీ ఎంపీలు దద్దమ్మలు: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-07-07T02:25:15+05:30 IST

రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు దద్దమ్మలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఒక్క

బీజేపీ ఎంపీలు దద్దమ్మలు: మంత్రి ఎర్రబెల్లి

జగిత్యాల: రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు దద్దమ్మలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు తెచ్చే సత్తా వీరికి లేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం అవార్డులు ఇచ్చింది, కానీ రూపాయి బిళ్ల ఇవ్వలేదని ఎర్రబెల్లి విమర్శించారు. నోరు పారేసుకోవడం కాదు, దమ్ముంటే నిధులు తీసుకురండని వారికి ఎర్రబెల్లి సవాల్ విసిరారు. నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలు మెడికల్ కాలేజీ తేలేకపోయారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-07T02:25:15+05:30 IST